టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విన్నూత్న రూపంలో చాలా బ్రహ్మాండంగా ముందుకు కొనసాగుతుంది. అలాగే చాలా మంది ప్రముఖుల మన్నలను పొందుతోంది. ఇందులో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నాడు క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్. నేడు ఢిల్లీలోని సుందర్ నగర్ లో ఉన్న తన నివాసంలో మొక్కలు నాటారు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వాతావరణ కాలుష్యం తగ్గి మంచి వాతావరణం కావాలని ఆశిద్దాం అని తెలిపారు. అందుకోసం భారతీయులందరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. మన భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
previous post
ఓట్ల కోసమే ఈబీసీ రిజర్వేషన్ బిల్లు: టీడీపీ ఎంపీ సీతారామలక్ష్మి