telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ధోని వీడ్కోలు సాంగ్ వైరల్… !

Ms dhoni cricketer

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని అందరికీ షాకిస్తూ రిటైర్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నాడు. ‘నేనో రెండు నిముషాల కవిని. నాదో చిన్న ప్రయాణం. నాలా ఎందరో వచ్చారు. వెళ్లారు. నేనూ అంతే. మరెందరో నాలాంటి వారు వస్తారు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో ఓ పాట రూపంలో వెల్లడించాడు. 1976లో వచ్చిన సూపర్‌హిట్‌ మూవీ ‘కభీ కభీ’లోని ‘మై పల్‌ దో పల్‌ కా షాయర్‌’ పాటను ధోని షేర్‌ చేశాడు. సాహిర్‌ లుధియాన్వి రచించిన ఈ పాటను ప్రఖ్యాత గాయకుడు ముఖేష్‌ ఆలపించారు. అప్పట్లో ఈ సాంగ్‌ విశేష ఆదరణ పొందింది. క్రికెట్‌లో తన 16 ఏళ్ల తన జర్నీని తెలిపే బెస్ట్‌ మూమెంట్స్‌తో కూడిన ఫొటోలను ఆ పాటతో మిక్స్‌ చేశాడు ధోని. ఈ పాట 2,86,09,653 వ్యూస్‌ సాధించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 64,77,407 మంది ఈ వీడియోను లైక్‌ చేశారు. క్రికెట్‌ జ్ఞానిగా పేరు తెచ్చుకున్న ధోని తన వీడ్కోలుకు సంబంధించి ఉద్వేగభరితమైన పాత పాటను ఎంచుకోవడం విశేషం.

 

View this post on Instagram

 

Thanks a lot for ur love and support throughout.from 1929 hrs consider me as Retired

A post shared by M S Dhoni (@mahi7781) on

Related posts