telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జలపాతం వద్ద స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న సాయి పల్లవి… పిక్స్ వైరల్

Sai-Pallavi

హీరోయిన్ సాయి పల్లవి తాజాగా కొండల్లో జలపాతం వద్ద స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను తాజా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇవి సాయి పల్లవి గతంలో అకేషన్‌కు వెళ్లినప్పటి ఫొటోలు. ఈ ఫొటోల్లో సాయి పల్లవి ఊడలు పట్టుకుని ఊగుతూ కనిపించారు. డార్విన్ జీవపరినామ సిద్ధాంతానికి ఇది రుజువు అని సరదాగా పేర్కొన్నారు. ఆ ప్రాంతం ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆ ఊడ పట్టుకుని తానొక విధ్వంసం సృష్టించే బంతిలా దూసుకొచ్చానని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సాయి పల్లవి పేర్కొన్నారు. అంతేకాదు, కోతి నుంచి మనిషి పరిణామం చెందాడు అని చార్లెస్ డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్ని తనకు అన్వయించుకున్నారు సాయి పల్లవి. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా… ప్రస్తుతం సాయి పల్లవి ‘లవ్‌ స్టోరీ’ సినిమాలో అక్కినేని నాగచైతన్య సరసన నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా సుమారు 5 నెలలు వాయిదా పడిన షూటింగ్ ఇటీవలే తిరిగి మొదలైంది. ప్రస్తుతం నిర్విరామంగా చిత్రీకరణ కొనసాగుతోంది. నాగచైతన్య, సాయి పల్లవి ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మరోవైపు, ‘విరాటపర్వం’ సినిమాలోనూ సాయి పల్లవి నటిస్తున్నారు.

 

View this post on Instagram

 

I came in like a wrecking ball !!! Cam B

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on

Related posts