telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రెండో ఇన్నింగ్స్ : 26 కు 7 వికెట్లు కోల్పోయిన భారత్….

నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా పింక్ బాల్ టెస్ట్ లో నేడు మూడో రోజు ఆట ప్రారంభమైంది. అయితే నిన్న పూర్తి ఆధిపత్యం చూపించి ఆతిధ్య జట్టుకు హడలు పుట్టించిన భారత్ నేడు రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ బౌలింగ్ కి బెంబేలెత్తుతుంది. నేడు 9 పరుగులకు ఒక వికెట్ కోల్పోయి ఆటను ప్రారంభించిన టీం ఇండియా 19 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇప్పటివరకు ఒక్క భారత బ్యాట్సమెన్ కూడా రెండంకెల స్కోర్ చేయలేదు. నిన్న షా(4) పరుగులకే ఔట్ కాగా నేడు బుమ్రా(2), పుజారా(0) మయాంక్(9), రహానే(0), కోహ్లీ (4), సాహా(4) వరుసగా పెవిలియన్ కు చేరుకున్నారు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 4 వికెట్లు తీసాడు. అయితే రహానే, పుజారా డక్ ఔట్ గా వెనుదిరగడం భారత జట్టును కష్టాల్లోకి నెట్టింది. ప్రస్తుతం క్రీజులో హనుమ విహారి(3), అశ్విన్ (0) బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే నిన్న ఆట చూసి ఈ మ్యాచ్ లో విజయం భారత్ దే అనుకున్నారు అంతా… కానీ నేడు చూస్తే మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. చూడాలి మరి కనీసం ఈ ఇద్దరు ఆటగాళ్లు ఎంత సేపు ఆడుతారు అనేది.

Related posts