telugu navyamedia
రాజకీయ వార్తలు

సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

sidda ramaiah

బీజేపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఓటమి నుంచి కోలుకోని సిద్ధరామయ్య ఇలాంటి అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర కర్ణాటకకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి యడియూరప్ప పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు ఇటీవల వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అసంతృప్త ఎమ్మెల్యేల్లో కొందరు తనను కలిశారని సిద్ధరామయ్య నిన్న తెలిపారు. తనను కలిసిన వారు ముఖ్యమంత్రి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, అయితే, ఈ విషయంలో తానేమీ చేయలేనని వారితో చెప్పినట్టు మాజీ సీఎం పేర్కొన్నారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్.. ఇది బీజేపీ అంతర్గత వ్యవహారమని, యడియూరప్ప ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయబోమని తేల్చి చెప్పింది.

Related posts