విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. బాధ్యత మరిచి మంత్రులంతా రెడ్జోన్లో తిరుగుతున్నారని అన్నారు. ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వీహెచ్ దీక్ష చేపట్టారు.
వీహెచ్ దీక్షకు ఆ పార్టీ అధినేత ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీ అజీజ్పాషా, టీజేఎస్ అధినేత కోదండరామ్, ఇంటిపార్టీ నేత చెరుకు సుధాకర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిపక్షాల సలహాలు తీసుకోవాలని వీహెచ్ సూచించారు.