telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం రాజకీయం: వీహెచ్‌

hanmanth rao congress

విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. బాధ్యత మరిచి మంత్రులంతా రెడ్‌జోన్‌లో తిరుగుతున్నారని అన్నారు. ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వీహెచ్‌ దీక్ష చేపట్టారు.

వీహెచ్‌ దీక్షకు ఆ పార్టీ అధినేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ అజీజ్‌పాషా, టీజేఎస్ అధినేత కోదండరామ్‌, ఇంటిపార్టీ నేత చెరుకు సుధాకర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిపక్షాల సలహాలు తీసుకోవాలని వీహెచ్‌ సూచించారు.

Related posts