telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరదనీటి ప్రవాహం…

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద పెరిగింది.. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో.. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్‌ 10 క్రస్టు గేట్లు 15 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. ప్రస్తుతం శ్రీశైలం ‌కు ఇన్‌ఫ్లో రూపంలో 2 లక్షల 62 వేల 490 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతుండగా.. 10 గేట్ల ద్వారా 4 లక్షల 04 వేల 625 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 213.8824 టీఎంసీలుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.70 అడుగులకు చేరింది. ఇక శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అయితే డ్యామ్‌ గేట్లు ఎత్తివేశారంటే పర్యాటకులకు పండుగ.. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున పర్యటాకులకు తరలివచ్చి.. డ్యామ్‌ అందాలను వీక్షిస్తుంటారు.

Related posts