telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఆంధ్రప్రదేశ్‌ నూతన సీఎస్‌గా సమీర్‌ శర్మ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ నియమితులయ్యారు. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈనెల 30న ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేయనున్నారు. అక్టోబ‌ర్ 1వ తేదీన సీఎస్‌గా స‌మీర్ శ‌ర్మ బాధ్య‌త‌లు చేప‌ట్టనున్నారు.

ఇప్పటికే మూడు నెలల ఎక్స్ టెన్షన్‌లో ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు. ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ (1987 బ్యాచ్‌).. సమీర్‌ శర్మ కంటే రెండేళ్లు జూనియర్‌. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ స‌మీర్ శ‌ర్మ‌.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆప్కో సీఎండీగా ప‌ని చేశారు.

Related posts