చంద్రబాబు నేడు కొండపల్లిలో జరుగుతున్నఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కొండపల్లికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని, కొండపల్లిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిధులు ఇచ్చామని సీఎం చంద్రబాబు చెప్పారు. కొండపల్లి ఖిల్లా ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. కొండపల్లి అంటే పేరొందిన కొండపల్లి బొమ్మలు గుర్తొస్తాయన్నారు. ఏకాగ్రతతో చేస్తే తప్ప ఇలాంటి బొమ్మలను తయారుచేయలేయమని చెప్పారు. రాబోయే భవిష్యత్తులో కొండపల్లిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, అమరావతికి వచ్చే పర్యాటకులు ఇక్కడికి వస్తారని చంద్రబాబు పేర్కొన్నారు.
Live from the Kondapalli Fort Utsavalu, @krishnadgoap. https://t.co/S1RdxjXHW3
— N Chandrababu Naidu (@ncbn) February 4, 2019
అక్రమాస్తుల కేసులో తమరు ఏ2నే కదా.. విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు