*యాదాద్రి జిల్లాలో పరువు హత్య కలకలం..
*రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్న రామకృష్ణ రెండురోజులు క్రితం అదృశ్యం..
యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య సంచలనం సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన సస్పెండ్ హోంగార్డు రామకృష్ణ మృతదేహమై కనిపించడంతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్కు గురైయ్యారు. అయితే, రామకృష్ణ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే..
యాదగిరిగుట్ట చెందిన భార్గవి వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి చెందిన రామకృష్ణ 2020 ఆగస్టు 16 ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నిరోజుల పాటు లింగరాజుపల్లి ఉన్న రామకృష్ణ దంపతులు భార్గవి ప్రెగ్నెన్సీ రావడంతో భువనగిరి పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఆరు నెలల క్రితం వీరికి పాప జన్మించింది.
వీరి ప్రేమ వివాహం భార్గవి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న యువతి తండ్రి పక్కా ప్లాన్తో అల్లుడిని దారుణంగా హత్య చేయించాడు.
రెండు రోజుల క్రితం రామకృష్ణను కిడ్నాపర్లు హైదరాబాద్కు పిలిపించారు. అనంతరం కిరాతకంగా హత్య చేసి, సిద్దిపేట జిల్లాలో మృతదేహాన్ని పడేసి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదృశ్యమైన హోంగార్డు రామకృష్ణ మృతదేహాన్ని సిద్దిపేట వద్ద పోలీసులు గుర్తించారు.
గతంలో హోంగార్డుగా ఉద్యోగం చేస్తున్న రామకృష్ణ గుప్త నిధుల కేసులో విధుల నుంచి సస్పెండ్ అయ్యాడు. అప్పటినుంచి రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు..
రామకృష్ణ మామ వీఆర్ఓ గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం రామకృష్ణను హైద్రాబాద్ కు పిలిపించి హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. రామకృష్ణ హత్యలో రౌడీషీటర్ లతీఫ్ తో పాటు మరో ముగ్గురు మహిళల పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.