రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీ రావు మనవరాలు బృహతి వివాహం శనివారం రాత్రి వైభవంగా జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక ఇందుకు వేదిక అయింది.
‘ఈనాడు’ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజకు రెండో కుమార్తె బృహతి. ఈమె వివాహం దండమూడి అమర్ మోహన్ దాస్, అనిత కుమారుడు వెంకట్ అక్షయ్తో జరిగింది. శనివారం రాత్రి 12.18 (ఆదివారం) గంటలకు వివాహం జరిగింది.
ఈ వివాహా మహోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ , సినీ నటులు రజనీకాంత్, చిరంజీవి, అల్లు అరవింద్, అశ్వనీదత్ సహా ఎంతో మంది రాజకీయ, న్యాయ, సినీ, వైద్య, పారిశ్రామిక రంగాల ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు
60 ఏళ్ల మన కష్టాన్ని తెలంగాణ దోచుకుంది: చంద్రబాబు