ఆంధ్రా-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని చిక్ బళ్లాపూర్ జిల్లా గౌరీబిదనూరు తాలూకా పరిధిలోని నగరిగేర బీఎన్ఆర్ రెస్టారెంట్ వద్ద పేకాట ఆడుతూ రెడ్హ్యాండెట్గా పట్టుబడ్డారు. పేకట స్థావరంపై కర్ణాటక పోలీసులు దాడులు చేసి.. హిందూపురానికి చెందిన 19 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు.
పట్టుబడ్డ వారిలో హిందూపురం ఎమ్మెల్యే పీఏ నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీతో పాటు హిందూపూరం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శ్రీరామ్ రెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి నుంచి రూ.1,56,750 నగదు, 8 కార్లు, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటకలో వైసీపీ నేత ఒకరు బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. నిందితులను కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో పోలీసులు కోర్టుకు హాజరు హాజరుపర్చగా..రిమాండ్కు ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.
కాగా హీరో బాలయ్య పీఏ అరెస్ట్ కావడం ప్రస్తుతం హిందూపురం రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. అందులోనూ అతడు వైసీపీ నేతలతో పేకాట ఆడుతుండటం చర్చనీయాంశంగా మారింది.