telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కోడెల భార్య, కుమార్తెకు అస్వస్థత..చికిత్స అందిస్తున్న వైద్యులు

case filed-kodela-daughter

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భార్య, కుమార్తె అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఇంటికి చేరుకున్న వైద్యులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంట్లోనే వారికి చికిత్స అందిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులు తాళలేకనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోడెల మృతదేహానికి ఇంతకు ముందే ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తయింది.

అక్కడి నుంచి ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ శ్రేణుల సందర్శనార్థం ఆయన పార్థీవ దేహాన్ని ఉంచారు. ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో కోడెల భౌతిక కాయం వద్ద పలువురు పార్టీ నేతలు ఆయనకు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ట్రస్టు భవనం నుండి కోడెల భైతిక కాయాన్ని రాత్రి 8 గంటలకు ఆయన ఇంటికి తీసుకెళ్లనున్నారు.మంగళవారం ఉదయం కోడెల శివప్రసాదరావు మృతదేహంతతో చంద్రబాబునాయుడు గుంటూరుకు చేరుకొంటారు. రేపు సాయంత్రం నర్సరావుపేటలో కోడెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Related posts