*టీడీపీ కార్యకర్తలు జోలికి వస్తే ఊరుకోం..
*గ్రామాల్లో వైసీపీ నేతలే కక్షలు రేపుతున్నారు.
టీడీపీ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
మేము తిరగబ్దాం,,ఖబడ్దార్ మీకు బుద్ధి చెబుతాం..
టీడీపీ నాయకుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీ నేతలే కక్షలు రేపుతున్నారని, వారు సంయమనం పాటించాలని అన్నారు.
హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ శుక్రవారం పర్యటించారు. హిందూపురం నియోజకవర్గంలో 2 వారాల క్రితం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కార్యకర్తల మధ్య పరస్ఫర దాడి జరిగింది. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు .
గాయపడ్డ టీడీపీ కార్యకర్తలని పరామర్శించిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగొద్దని, ఒకవేళ జరిగితే ఊరుకొనేది లేదని అన్నారు. తాము కూడా తిరగబడతామని అన్నారు.
సామ, దాన, బేద దండోపాయాలను మేం కూడా ప్రయోగిస్తామని అన్నారు. ప్రతి దానికి సహనం ఉంటుందని, తర్వాత కోల్పోతామని అన్నారు. ఇకపై వైసీపీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని, మళ్లీ ఇలాంటి ఆలోచనలు వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. పార్టీ కార్యకర్తలే కాకుండా.. ప్రజలు కూడా వైసీపీ నేతల్ని ఎలా తరిమికొడుతున్నారో చూస్తున్నామని అన్నారు.
ఎన్టీఆర్ వాస్తవ జీవిత చరిత్రను తీసే ధైర్యం బాలకృష్ణకు లేదు: లక్ష్మీపార్వతి