దేశంలో థర్డ్ వేవ్ మొదలైంది.. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీలు దాగా కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
ఇప్పటివరకు మంచు మనోజ్, మంచు లక్ష్మి, మహేష్బాబు, రాజేంద్ర ప్రసాద్, హీరో నితిన్ భార్య, తమన్, త్రిష, బండ్ల గణేష్ ఇలా ఒక్కొక్కరుగా కరోనా బారిన పడ్డారు. తాజాగా..హీరోయిన్ ఇషా చావ్లా కూడా కరోనా బారిన పడినట్టు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఆది హీరోగా ‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా ఇషా చావ్లా హీరోయిన్ గా టాలీవుడ్లోకి పరిచయం అయింది. ఆ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన ఆమె ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో నటించింది. అలాగే ‘పూలరంగడు’, ‘Mr పెళ్ళికొడుకు’, జంప్ జిలాని, విరాట్, రంభ ఊర్వశి మేనక, వంటి అనేక చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి ఇషా చావ్లా ప్రస్తుతం కబీర్ లాల్ దర్శకత్వంలో 6 బాషల్లో వస్తున్న “దివ్య దృష్టి” సినిమాలో మెయిన్ లీడ్ గా నటిస్తుంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
తాజాగా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తనకు కరోనా సోకినట్టు వెల్లడించింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఇషా చావ్లా అందరూ కూడా డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ తగిన జాగ్రత్తలు పాటించి ప్రజలు , సేఫ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
అలాగే త్వరలో కరోనా నుండి బయటపడి నేను చేయబోయే తెలుగు సినిమా షూటింగ్ లలో పాల్గొంటానని తెలిపింది. ఈ అమ్మడు ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్లో మాత్రం యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలు పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తోంది.