telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ర‌ణు మొండ‌ల్ ను పోలిన మరో మహిళ… వీడియో వైరల్

Ranu

ఓవర్ నైట్ స్టార్ గా మారిన ర‌ణు మొండ‌ల్ ఇప్పుడు తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ర‌ణు మొండ‌ల్ ను పోలిన మరో మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గౌహ‌తికి చెందిన ఓ మ‌హిళా అచ్చం ర‌ణులా ఉండ‌డంతో చుట్టుప‌క్క‌ల వారు ఆమె ద‌గ్గ‌ర‌కి వెళ్లి తేరి మేరి క‌హానీ పాట‌ని కొద్దిగా పాడమ‌ని కోరారు. దాంతో ఆమె పాట‌ని కొద్దిగా పాడి వినిపించింది. ఈ త‌తంగాన్నంతా వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ప్ర‌స్తుతం ఇది వైర‌ల్‌గా మారింది. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. అలానే ర‌ణుని పోలిక‌ల‌తో ఉన్న మ‌రో వ్య‌క్తి నెటిజ‌న్స్ కంట ప‌డింది. ఇంకేముంది ఆమెను ప్రపంచానికి [పరిచయం చేశారు. కాగా… పశ్చిమ బెంగాల్‌లోని రాణాఘాట్ రైల్వే స్టేషన్ వద్ద పాటలు పాడుకుంటూ జీవనం సాగించే ర‌ణు మొండ‌ల్ ఓవ‌ర్ నైట్ సెల‌బ్రిటీ అయిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ నటుడు, గాయకుడు హిమేష్ రేష్మియాతో క‌లిసి ‘తేరీ మేరీ కహానీ’ పాట పాడిన రనూ మండల్‌కు మరింత క్రేజ్ పెరిగింది. అయితే ఇటీవ‌ల‌ ఆమె అభిమానుల‌తో ప్ర‌వ‌ర్తించిన తీరుతో మ‌రోసారి వార్త‌ల‌లోకి ఎక్కింది.

Related posts