telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత‌రం..అప్రమత్తం కావాలని పవన్ పిలుపు

దేశంలో కరోనా, ఒమిక్రాన్ తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకంతో పాటు ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విందులు, సమావేశాలు వంటి వాటిని కొన్నాళ్లపాటు దూరంగా ఉండ‌డం మంచిది అంటూ పేర్కొన్నారు. రాబోయే సంక్రాంతి పండుగను కూడా కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకోడానికి ప్రయత్నించండి అంటూ సూచించారు.

భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇంటి నుంచి బయటకు వెళ్ళవలసివచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలన్నారు. అందుబాటులో ఉంటే డబుల్ మాస్క్ ధరించండి అంటూ ప్రజలకు పవన్ కల్యాణ్ సూచించారు.

ఇప్పటి వరకు టీకా తీసుకొని వారు ఉంటే తప్పనిసరిగా టీకా వేయించుకోవాలంటూ తెలిపారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటుగా మార్చుకోవాలన్నారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటుగా మార్చుకోవాలన్నారు. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలతో కరోనా ఉధృతిని కొంతవరకు తగ్గించుకోగలమన్నారు.

కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సమాచారాన్ని మీడియా ద్వారా మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నామన్నారు. దేశంలో నిన్న ఒక్క రోజే లక్ష 80 వేల మందికి కరోనా సోకినట్లు గణాంకాలు తెలుపుతున్నాయన్నారు. అంతకు ముందు రోజు ఆ సంఖ్య లక్ష 59 వేలుగా ఉందంటే మహమ్మారి వేగంగా విస్తరిస్తోందని అందరూ గమనించాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 12వందలకు పైగా, తెలంగాణలో 15వందలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. చూస్తుండగానే కరోనా సోకిన వారు మన చుట్టూ పెరుగుతున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా యాక్టీవ్ కేసులు 7.23 లక్షలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పిన క్రమంలో మనమందరం అప్రమత్తంగా ఉండి ఈ మహమ్మారిని తరిమేద్దామని పేర్కొన్నారు.

కరోనా సెకండ్‌వేవ్‌లో మందులు, ఆక్సిజన్ దొరక్క ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని… ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను పవన్ కళ్యాణ్ కోరారు.ఆయా ప్రభుత్వాలు తక్షణమే అప్రమత్తమై కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు. 

అంతేకాకుండా జన సైనికులు కూడా కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని కోరారు. అలాగే కరోనాతో ఆపదలో ఉన్నవారిని ఎప్పటిలాగే ఆదుకోవాలని.. ఈ క్రమంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలన్నారు.

Related posts