telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మంత్రి పరిటాల సునీత కాన్వాయ్ పై చెప్పులు!

Paritala Sunitha Kanvyai Ladies Break

మంత్రి పరిటాల సునీత కాన్వాయ్ ను అడ్డుకునేందుకు డ్వాక్రా మహిళలు యత్నించారు. కాన్వాయ్ ను మహిళలు అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. దీంతో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమలో మంత్రి కాన్వాయ్ పై చెప్పులు విసిరారు.

డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్న హామీని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపిస్తూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నల్ల జెండాలు ధరించి ఆందోళనకు దిగారు. కాగా, డ్వాక్రా మహిళల ఆందోళన కారణంగా యాలేరు గ్రామ శివారులో పరిటాల సునీత గంటకు పైగా వేచి ఉన్నారు. తోపుదుర్తికి సునీత కాన్వాయ్ నాలుగు గంటలు ఆలస్యంగా చేరుకుంది.

Related posts