telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఎంపీ రవీంద్రబాబు వచ్చేస్తానంటూ చంద్రబాబుకి కబురు…

Tdp Mp Ravindrababu join YCP

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు మళ్లీ టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత నెలరోజుల క్రితం ఎంపీ రవీంద్రబాబు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. అయితే.. వైసీపీలో చేరిన కొద్ది రోజులుకే, పండుల రవీంద్రబాబుని తీవ్రంగా అవమానాలు ఎదుర్కున్నరాని తెలుస్తుంది. అటు జగన్, ఇటు విజయసాయి రెడ్డి ఇద్దరూ కలిసి, రవీంద్రబాబుని బాగా అవమానించారని సమాచారం. కేవలం చంద్రబాబుని సాధించటం కోసం, రవీంద్రబాబుకి నచ్చ చెప్పి, బెదిరించి పార్టీలో చేర్చుకున్నారు. నీకు సీట్ ఇస్తాం, ముందు వచ్చి పార్టీలో చేరండి అని చెప్పటంతోనే, ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.

అయితే ఇప్పుడు అవమానాలు భరిస్తూనే, సీటు కోసం జగన్ దగ్గరకు వెళ్ళగా తీవ్రంగా అవమానించారని సమాచారం. సిట్టింగ్ ఎమ్మల్యేగా అక్కడే గెలవలేవు అని టిడిపి చెప్తుంది, ఇంకా నీకు సీటు ఇచ్చి నేను ఏమి అవ్వాలి, మీకు సీట్ ఇచ్చేది లేదు, పార్టీకి సహకరించండి, నెక్స్ట్ నేనే సియం, అప్పుడు ఏదో ఒకటి మీకు చూస్తాను అని జగన్ చెప్పినట్టు సమాచారం. అవమాలు పడటం, కోరుకున్న సీటు దక్కకపోవడంతో మళ్లీ టీడీపీలోకి వస్తానంటూ టీడీపీ పెద్దలతో అన్నట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు టీడీపీ పెద్దలతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం, ఇలాంటి వారిని ఎంకరేజ్ చెయ్యవద్దు అని, పెండింగ్ లో పెట్టేసారని తెలుస్తుంది.

పండుల రవీంద్రబాబు రాకను టీడీపీ శ్రేణులు నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీంతో చంద్రబాబు కూడా, అతని పట్ల అసలు ఇంటర్స్ట్ చూపించటం లేదు. ఇప్పుడు రవీంద్ర బాబు, అటు జగన్ దగ్గర దిక్కు లేక, ఇటు చంద్రబాబు పట్టించుకోక, ఏకాకిగా మిగిలిపోయారు. చక్కగా చంద్రబాబు చెప్పినట్టు వింటే, ఎదో ఒక గౌరవ పదవి ఇచ్చేవారు. గౌరవం చూసుకునే వారు. కాని ఆత్మగౌరవం చంపుకుని, జగన్ దగ్గరకు వెళ్ళినందుకు, తగిన శాస్తి జరిగింది అంటూ, రవీంద్ర బాబు బాధ పడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి, జగన్, విజయాసాయి ఖాతాలో, మరొక బకరా బలి అయ్యాడు.

Related posts