telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

షాకింగ్‌ : ఏపీలో మరో విగ్రహం ధ్వసం

ఏపీలో దేవాలయాలపై వరసగా దాడులు జరుగుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. రామతీర్ధం ఘటనతో ఒక్కసారి గా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలు సీరియస్ అయ్యాయి. ప్రభుత్వం, పోలీసులు దీనిపై అప్రమత్తమైనప్పటికీ… ఏపీలో ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళం టెక్కలిలో బుద్దుని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ధ్వంసం చేశారు. ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచి నీటి పథకం పక్కనున్న ఉద్యానవనంలో ఎన్టీఆర్‌, ఎర్రన్నాయుడు, తెలుగుతల్లి విగ్రహాలతో పాటు బుద్దుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం కుడి చేతి భాగాన్ని నెల రోజుల క్రితం కొందరు దుండగులు ధ్వంసం చేయగా గుర్తించిన అధికారులు శిల్పి సాయంతో కొత్త చేతిని అమర్చారు. అయితే.. ఆదివారం రాత్రి బుద్దుని చేయిని ఎవరో మళ్లీ విరగ్గొట్టారు. ఈ పని కొందరు ఆకతాయిలు కావాలనే చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేసింది గ్రామీణ నీటి సరఫరా విభాగం.

Related posts