ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది సెలవుపై వెళ్లిపోయారు. ఈ నెల 11 నుంచి 15 వరకూ ఆయన వ్యక్తిగత కారణాల రీత్యా సెలవుపై వెళుతున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఏపీ కేబినెట్ భేటీ ఈనెల 14న జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రధానాధికారి సెలవుపై వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.
సెలవు ఆనంతరం గోపాలకృష్ణ ద్వివేది ఈ నెల 16న సచివాలయానికి వస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే ద్వివేది సెలవు కారణంగా కేబినెట్ అజెండా మరింత ఆలస్యమయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. కేబినెట్ భేటీ ముందు ద్వివేది సెలవు పై వెళ్ళడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.