ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈరోజు విశాఖపట్నంలోని ఏజెన్సీలో పర్యటించారు. ఈ సందర్భంగా పాడేరు ఏజెన్సీలోని ఐటీడీఏ ఆఫీసులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి పై చర్చించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజన రైతులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా పాడేరులోని మోదకొండమ్మ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ డ్యాన్స్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
previous post
సీఎం జగన్ కు దెయ్యం పట్టింది: పంచుమర్తి అనురాధ