తెలంగాణలో ఇంటర్ ఇంటర్ బోర్డు అవకతవకలపై విపక్షాలన్నీ ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ వద్ద ఈరోజు ఆందోళన నిర్వహించాయి.ఈ సందర్భంగా దీక్షా శిబిరంలో ఓ కుర్చీ విషయమై కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, టీపీసీసీ సెక్రటరీ నగేష్ల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా తోపులాట జరిగింది. కుర్చీల కోసం జరిగిన ఘర్షణలో ఒకరినొకరు తోసుకున్నారు.
ఈ తోపులాటలో నగేష్ కింద పడిపోయారు. అనంతరం నగేష్ కూడా లాగడంతో వీహెచ్ కూడా కింద పడిపోయారు. దీక్షాస్థలిలో వీహెచ్ కు కేటాయించిన కుర్చీని నగేశ్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ కుంతియాకు ఇచ్చినట్లు సమాచారం. దీంతో సహనం కోల్పోయిన ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగారు. వారిద్దరికీ అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు కానీ వాళ్లు వినలేదు.