telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై నారా లోకేశ్ ఫైర్

Nara Lokesh

నెల్లూరు జిల్లా కావలి వద్ద ముసునూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు ఇటీవల తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ముసునూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు.

ఈ క్రమంలో ఐదుగురు టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. బాధితులతో మాట్లాడానని, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చానని వెల్లడించారు. తొలగించిన చోటే ఆ తారకరాముడి విగ్రహం మళ్లీ ఏర్పాటవుతుందన్నారు. ఇది అన్నగారి మనవడు ఇస్తున్న మాట అని లోకేశ్ ట్వీట్ చేశారు.

Related posts