telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీలో నైతిక విలువలున్న పార్టీలేవీ కనిపించలేదు: నటి మాధవీలత

madhavilatha
ఏపీలో నైతిక విలువలున్న ప్రాంతీయ పార్టీలేవీ తనకు కనిపించలేదని సినీనటి, బీజేపీ గుంటూరు వెస్ట్ అభ్యర్థి మాధవీలత అన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  తాను ఈ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉంటానని  తెలిపారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకునే మనసుంటే రాజకీయాల్లో రాణించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రాంతీయ పార్టీల్లో ఉంటే ఒక్క పార్టీకే అంకితమవ్వాల్సి ఉంటుదని అందుకే తాను బీజేపీలాంటి జాతీయ పార్టీలో చేరానని ఆమె వివరించారు. 
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల కంటే గుంటూరు రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుందని, తనకు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఉన్నత చదువులు చదివిన తనకు ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసు అని చెప్పారు. తాను ఇక్కడి నాయకుల్లాగా బీకాంలో ఫిజిక్స్ చదవుకులేదంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. తనకు ప్రజాక్షేత్రంలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటానని తెలిపారు.

Related posts