1986 ఆగష్టు 14న వెంకీ హీరోగా ఫస్ట్ మూవీ కలియుగ పాండవులు విడుదల అయింది. నేటికీ ఈ సినిమా విడుదలై 34 ఏళ్ళు ఇప్పటికే అదే ఎనర్జీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు వెంకటేష్. యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా పాత్ర ఏదైనా తనదైన శైలిలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు విక్టరీ వెంకటేష్. రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకటేష్ అనతి కాలంలోనే మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. విక్టరీనే తన ఇంటి పేరుగా మార్చుకున్న వెంకీ ఫ్యామిలీ ఆడియన్స్ని ఎక్కువగా ఆకర్షించాడు. కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా, నువ్వు నాకు నచ్చావ్, పవిత్ర బంధం, గణేష్, లక్ష్మీ, తులసి వంటి చిత్రాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్ని మరోసారి తీసుకొచ్చి అద్భుతమైన హిట్స్ సాధిస్తున్నారు వెంకటేష్. తొలిసారి మహేష్ బాబుతో కలిసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన వెంకీ తరువాత యంగ్ హీరో వరుణ్ తేజ్తో కలిసి ఎఫ్ 2 సినిమా చేశారు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక తాజాగా తన రియల్ లైఫ్ అల్లుడు నాగ చైతన్యతో కలిసి రీల్ లైఫ్లో వెంకీ మామ చేశాడు. వెంకీ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ అసురన్ రీమేక్ తెలుగు నారప్పలో నటిస్తున్నారు.