కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజాప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు కరోనాబారిన పడ్డారు. ఈ వైరస్తో చాలా మంది ప్రముఖులు కూడా మృతి చెందారు. తాజాగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా తన ట్విటర్ ద్వారా వెల్లడించాడు. రామ్ చరణ్ కరోనా బారిన పడ్డ తర్వాత కొద్ది సేపటికే వరుణ్ తేజ్కు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో మెగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మెగా కోడలు, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కొణిదెల ఓ ఎమోషనల్ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియా బాగా వైరల్ అవుతోంది. చరణకు పాజిటివ్ వచ్చిన తర్వాత తాను కొవిడ్ టెస్ట్ చేయించుకున్నానని… తనకు నెగిటివ్ వచ్చిందని పేర్కొంది ఉపాసన. కానీ తనకు మళ్లీ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా తెలిపింది. ప్రస్తుతానికి హోం క్వారంటైన్లో ఉన్నానని… వేడి నీరు, ఆవిరి పట్టడం, విశ్రాంతి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్వీట్ చేసింది ఉపాసన.
previous post
ఆ సినిమాలు చేయను… దర్శకులకు నచ్చకపోవచ్చు : రష్మిక