telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అభివృద్ధి పనులకు హరీశ్ రావు ప్రారంభోత్సవాలు

Harish Rao trs

సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడీ కేంద్రానికి, గజ్వేల్ మండలం ముట్రాజ్ పల్లి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు మంత్రి ప్రారంభోత్సవం చేశారు.

అలాగే సిద్దిపేట పట్టణంలోని బారాయిమామ్ చిన్నమసీదు సమీపంలో మంగళవారం రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న పద్మశాలీ సమాజ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, స్థానిక కౌన్సిలర్లు, పద్మశాలీ సమాజ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Related posts