*రేపు శిల్పా వేదికలో మునావర్ ఫారుఖీ కామెడీ షో
*మునావర్ ఫారుఖీ కామెడీ షో అడ్డుకుంటామన్న రాజాసింగ్
*రాముడుపై మునావర్ ఫారుఖీ తప్పుగా మాట్లాడారు..
*రేపు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత
హైదరాబాద్ నగరంలో శిల్పా వేదికలో మునావర్ ఫరూకీ కామెడీ షో కి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. రేపు (శనివారం) హైద్రాబాద్ లో ఈ షో ను నిర్వహించనున్నారు.
అయితే, హిందూదేవీదేవతలను అవమానిస్తూ గతంలో వ్యాఖ్యలు చేసిన ఇలాంటి వ్యక్తి కార్యక్రమానికి అనుమతివ్వడం పట్ల బీజేపీ, హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో అనుమతి ఇవ్వొద్దంటూ బీజేవైఎం నేతలు డీజీపీ ని సైతం కలిశారు. అయినా కూడా ఈ షోకు అనుమతి లభించింది.
ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. మునావర్ ఫారూఖీ కామెడీ షోను షో నిర్వహిస్తే తీవ్ర పరణామాలుంటాయని ఇటీవల వార్నింగ్ ఇచ్చారు..
ఎక్కడ షో నిర్వహిస్తారో ఆ హాల్ ను దగ్దం చేస్తామని, ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేశారు.
హిందూ దేవుళ్లను అవమానిస్తూ జరిగే మునావర్ షోను చాలా రాష్ట్రాలు రద్దు చేశాయని రాజా సింగ్ తెలిపారు. ఇటీవల ఇండోర్, ముంబై, కర్ణాటకలోనూ అతని కార్యక్రమాలు అక్కడి ప్రభుత్వాలు రద్దు చేశాయన్నారు.
కానీ, దురదృష్టవశాత్తు మా కేటీఆర్.. రాముడిని, సీతను అవమానించే వ్యక్తి కార్యక్రమానికి అనుమతిచ్చారు అని రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి హిందూ మనోభావాలకు విలువ ఇవ్వదా? అని ప్రశ్నించారు.
షో లోపలే మునావర్ ఫారుకీని కొట్టేందుకు ప్లాన్ చేశామని, షోకి ఎంట్రీ పాస్ లను కూడా మా రామ భక్తులు సంపాదించారు. కేసీఆర్, కేటీఆర్ లు హిందూ సమాజానికి చీడ పురుగులు అని పేర్కొన్నారు.
కాగా..మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికల నేపథ్యంలో ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇంటి నుంచి రాజాసింగ్ బయటకు వస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
ప్రశ్నించాలనే ప్రజలు నన్ను గెలిపించారు: రేవంత్