telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ సీఎస్‌కి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో లేఖ..

ap cs neelam, Nimmagadda

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఏపీ సీఎస్‌ కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ రాశారు. గురువారం ఏర్పాటు చేయనున్న వీడియో కాన్ఫరెన్స్‌కు అధికారులు హాజరయ్యేలా ఆ లేఖలో కోరారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చకు సమావేశం కావాలని నిర్ణయించినట్లు కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య ఘర్షణ పూరిత వాతావరణం కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో కొనసాగించే ఆలోచన ఉన్నట్లు నిమ్మగడ్డ ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో నిన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సంబంధించి వీడియో కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎస్‌ కు ఆదేశించారు. అయితే.. నిన్న వీడియో కాన్ఫరెన్స్‌ జరగలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లభించకపోవడంతో ఈ కార్యక్రమం జరగలేదు. దీంతో గురువారం అయినా సరే వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేయాలని సీఎస్‌ నీల సాహ్నీకి నిమ్మగడ్డ మరో లేఖ రాశారు. అయితే.. ప్రభుత్వం ఇంతవరకు అనుమతి ఇవ్వకపోవడంతో ఇవాళ కూడా వీడియో కాన్ఫరెన్స్‌ రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది.

Related posts