telugu navyamedia
క్రీడలు వార్తలు

కరోనా బారిన పడిన ముగ్గురు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు…

useless won by south africa 4 teams to semis

కేప్ టౌన్ లో నిర్వహించిన కరోనా పరీక్షలో దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు పాజిటివ్ గా వచ్చింది అని… దాంతో వారిని ఒంటరిగా ఉంచినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరు అనేది మాత్రం తెలుపలేదు. ఇక కేప్ టౌన్‌లో నవంబర్ 27 నుంచి దక్షిణాఫ్రికా 3 టీ 20, 3 వన్డేల సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టుకు ఆతిథ్యమివ్వనుంది. అయితే పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లకు ఎవరికీ కరోనా లక్షలను కనిపించడం లేదు అని క్రికెట్ బోర్డు చెప్పింది. ఈ పాజిటివ్ వచ్చిన ఆటగాళ్ల స్థానంలో కొత్తగా ఎవరిని జట్టులోకి తీసుకోలేదు. కానీ ఈ మ్యాచ్ ల కంటే ముందు జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్ ల కోసం మాత్రం ఇద్దరు ఆటగాళ్లు జట్టులో చేరనున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సిరీస్ లు కూడా బయో బబుల్ లోనే ప్రేక్షకులు లేకుండా జరగనున్నాయి. కేప్ టౌన్ లో 1 మరియు 3 వ టీ 20 మ్యాచ్లు నవంబర్ 27 మరియు డిసెంబర్ 1 న నిర్వహిస్తుంది. ఇక 1వ మరియు 3 వ వన్డేలను వరుసగా డిసెంబర్ 4 మరియు 9 తేదీలలో నిర్వహిస్తుంది. ఇక మిగిలిన మ్యాచ్‌లు పార్ల్‌లో జరుగుతాయి.

Related posts