మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 13,165 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది. బుధవారం రోజున 346 మంది మృతి చెందారు. 9,011 మంది పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,28,642కు చేరింది. ఇప్పటి వరకు కరోనా బారినపడి 21,033 మంది మృతిచెందారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,46,881కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,60,413 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.