telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

క్రిస్మిస్‌ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌

Tamilisai Soundararajan governor

హైదరాబాద్ రాజ్‌భవన్‌లో క్రిస్మిస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పాల్గొన్నారు. రాజ్‌భవన్‌ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో ఉత్సవాల్లోపాల్గొన్నారు. ఈసందర్భగా పలువురు ఏసక్రీ స్తును ప్రస్తుతిస్తూ కీర్తనలను ఆలపించారు.

ఈసందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ ఏసు క్రీస్తు శాంతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా పేర్కొన్నారు. మానవ జాతి సంక్షేమానికి కృషి చేశారని అన్నారు. ఈసందర్భంగా ఏసు కీర్తనలనుఆలపించిన వారిని గవర్నర్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అరుణ బహుగుణ, రిటైర్డ్‌ ఐఏఎస్‌అధికారులు రేచల్‌ఛటర్జీ, డా.డాఫ్నిరెబెల్లో, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Related posts