విజయవాడలోని కోవిడ్ సెంటర్గా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో లో మృతుల సంఖ్య 11కి చేరింది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో 50 మంది ఉన్నట్లు తెలియవచ్చింది. బాధితులను లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్, కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి స్పందించారు.
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కరోనా రోగులు మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి సుజనా సూచించారు.