రానున్న మునిసిపల్ ఎన్నికల్లో విజయం తమదేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని మంత్రి తలసాని యాదవ్ పేర్కొన్నారు.
ఈ రోజు తలసాని మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అసలు బీసీలకు అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని ధ్వజమెత్తారు. తొలుత మీ పార్టీలోని బీసీ నేతలకు విలువ ఇవ్వండని ఉత్తమ్ కు సూచించారు. కాంగ్రెస్ చేసేవి చిల్లర రాజకీయాలని.. తమకు ఏ పార్టీ ప్రత్యామ్నాయం కాదన్నారు.
వైసీపీకి ధైర్యముంటే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి : కవిత