సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య భారీగా వలసలు పెరిగాయి. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి ఆయన బావ రామకోట సుబ్బారెడ్డి షాకిచ్చారు. సోమిరెడ్డి బావ, టీడీపీ నేత కేతిరెడ్డి రామకోటారెడ్డి తన కుమారులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ తో ఆయన భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లా టీడీపీలో మంత్రి సోమిరెడ్డి కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.
సోమిరెడ్డి కడప జిల్లా ఇన్చార్జి మంత్రిగా కూడా ఉన్నారు. సోమిరెడ్డి బావే వైసీపీలో చేరడం టీడీపీలో కలకలం రేపుతోంది.రామకోట సుబ్బారెడ్డి వైసీపీలో చేరడానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ప్రధాన పాత్ర పోషించారనే ప్రచారం జరుగుతోంది. ఓ ఇంటికి సంబంధించిన గొడవ కారణంగా బావబావమరుదుల మధ్య గొడవ జరిగిందని జిల్లాలో చర్చ నడుస్తోంది. ఇంటి విషయమై మొదలైన మనస్పర్థలు కోటారెడ్డి కుటుంబాన్ని వైసీపీ వైపుకు తీసికెళ్ళినట్లు తెలుస్తోంది.