కరోనా వైరస్ అన్నీ రంగాల వారిని టచ్ చేస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు వైరస్ బారినపడ్డ విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక ఆరోగ్య మంత్రి బి.శ్రీరాములకు కరోనా సోకింది. జ్వరంగా ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకోగా ఆదివారం పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ట్విట్టర్లో ఆయన తెలిపారు.
కరోనా ప్రబలినప్పటిప్పటి నుంచి రాష్ట్రంలోని 30 జిల్లాల్లో పర్యటిస్తూ కరోనా రోగులకు అందుతున్న చికిత్సలు, సౌకర్యాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, ఈ క్రమంలో తనకు కరోనా సోకడంతో దవాఖానలో చేరినట్లు శ్రీరాములు చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు.
జబర్దస్త్ తో గొప్పగా పేరు తెచ్చుకున్న రోజా.. రియల్ లైఫ్ లోనూ గొప్పగా నటిస్తోంది: నన్నపనేని