telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

పాక్ నుంచి హిందూ కుటుంబం వలస.. ఒకేసారి 11 మంది ఆత్మహత్య

Crime

పాకిస్థాన్ నుంచి భారత్ కు వలస వచ్చిన ఓ హిందూ కుటుంబంలో ఒకేసారి 11 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన రాజస్థాన్ లో జరిగింది. కొన్నాళ్ల కిందట పాక్ నుంచి రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు ఓ కుటుంబం వలస వచ్చింది. ఆ కుటుంబానికి చెందినవారు అక్కడికి సమీపంలోని ఓ గ్రామంలో కౌలు సాగు చేసుకుంటూ పొలంలోనే నివసిస్తున్నారు.

ఆదివారం ఉదయం స్థానికులు అక్కడి దృశ్యాలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ ఇంటి సభ్యులు విగతజీవుల్లా పడివున్నారు. దాంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా, ఒక్క వ్యక్తి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుండగా ఆసుపత్రికి తరలించారు. 11 మంది మరణించినట్టు గుర్తించారు. వారి శరీరాలపై గాయాలేమీ లేకపోవడంతో, ఏదైనా విషం తీసుకుని చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Related posts