తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం రసాభాసగా మారింది. గాంధీభవన్లో గులాంనబీ ఆజాద్ ఎదుటే కాంగ్రెస్ నేతలు వీహెచ్-షబ్బీర్ అలీ వాగ్వాదానికి దిగారు. తీవ్ర పదజాలంతో ఒకరినొకరిని దూషించుకున్నారు. పార్టీలో అసలైన సీనియర్లకు న్యాయం జరగడం లేదని వీహెచ్ అన్నారు.
ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారిని ప్రోత్సహిస్తున్నారని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతుందంటూ సమావేశం మధ్యలోనే వీహెచ్ బయటికి వెళ్లిపోయారు. ఆజాద్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. వీహెచ్ గురించి మాట్లాడాల్సిన అవసరం తనకులేదని షబ్బీర్ అలీ తెలిపారు.
అమరాతిలో చంద్రబాబు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు: వైసీపీ ఎమ్మెల్యే ఫైర్