ఒక్క పాటతో సూపర్ సెలిబ్రెటీ స్థాయినందుకున్న రనుమండల్ దశ తిరిగిపోయింది. రైల్వే స్టేషన్ వద్ద భిక్షాటన చేసుకునే మండల్ తన పాటతో అందర్నీ ఆకట్టుకునేది. ‘ఏక్ ప్యార్ క నగ్మా హై’ అని రను పాడిన పాటను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు గాయకుడైన హిమేష్ రేష్మియా ఆమె కోసం వెదుక్కునీ మరీ వచ్చాడు. తాను కంపోజ్ చేస్తున్న ‘తేరీ మేరీ కహాని’ సినిమాలో గాయనిగా ఆఫర్ ఇచ్చాడు. ఆమెతో కలిసి డ్యూయట్ కూడా పాడాడు. ఓవర్ నైట్ స్టార్ సింగర్గా ఎదిగిన రను మండల్ మరో పాట నెట్టింట్లో సందడి చేస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ ఎవర్ గ్రీన్ మూవీ ‘దిల్ వాలే దుల్హనియా లే జాయింగే‘ నుంచి రను పాడిన మరో పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. డీడీఎల్ నుంచి తుఝె దేఖాతో ఏ జానమ్ అనే పాటను రను పాడింది. దీంతో రను పాటకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “ఆషికి మై తేరీ” అంటూ మొదలైన ఈ పాటను కూడా రను అద్భుతంగా పాడింది. తాజాగా రనూమండల్కు సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో కనిపిస్తున్న ఆమె వ్యవహారశైలిని చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రనూమండల్ను ఒక అభిమాని సెల్ఫీ కోసం కోరగా, ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు చేయి చేసుకుంది. వివరాల్లోకి వెళితే రానూమండల్ సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తుండగా ఒక మహిళ ఆమెను గమనించి, ఆమె చేతిని ముట్టుకుని సెల్ఫీ కోసం రిక్వస్ట్ చేసింది. అయితే రానూ మండల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ మహిళపై చేయి చేసుకుంది. అయినప్పటికీ ఆ అభిమాని నవ్వుతూనే ఉంది. కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు…. గతాన్ని మరచిపోకూడదంటూ రనూమండల్కు గుర్తు చేశారు.
బాలయ్య వ్యాఖ్యలతో చిరు షాకింగ్ డెసిషన్…?