telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ ఉద్యోగులకు కెసిఆర్ సర్కార్ గుడ్ న్యూస్

rtc employees telangan

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి.  ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు కెసిఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుండి 3 రోజుల పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్ చేయనుంది సర్కార్. సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు సూపర్ స్ప్రైడర్లలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కోవిడ్ వాక్సినేషన్ చేయనుంది. దాదాపు మొత్తం భాగంగా 50 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లకు లబ్ధి చేకూరనుంది. మూడు రోజుల్లో వాక్సినేషన్ పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి ఆర్టీసీ, వైద్య , ఆరోగ్య శాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు.

Related posts