telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లుఅర్జున్ తో కేజీఎఫ్‌ డైరెక్టర్‌ భేటీ

అల్లుఅర్జున్ పాన్ ఇండియా రేంజ్‌లో చేస్తున్న సినిమా పుష్పా అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో రష్పికా మందానా కథానాయికగా ఓ తండా వాసినిగా కనిపించనుంది. దీనితో పాటుగా ఈ సినిమాతోనే అల్లు అర్జున్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేయనున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా..ప్యాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ దీనికి వేదిక అయింది. వీరిద్దరి మధ్య కొంత సమయం చర్చలు జరిగాయి. దీంతో వీరి కలయికలో సినిమాపై ఫ్యాన్స్ లో ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం కెజీఎఫ్‌2 ని పూర్తి చేసిన ప్రశాంత్ ప్రభాస్ తో ‘సలార్’ సినిమాని రూపొందిస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా కమిట్ అయ్యాడు. అయితే ఇప్పుడు సడన్ గా ప్రశాంత్ బన్నీతో భేటీ అవటంతో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మరి వీరిద్దరి భేటీ క్యాజువల్ గా జరిగిందా? లేక కాంబినేషన్ లో సినిమా అనే యాంగిల్ లో జరిగిందా అన్నది తేలాల్సి ఉంది. 

Related posts