telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిత్ర పరిశ్రమలో మరో విషాదం : కరోనాతో మరో సినీ ప్రముఖుడు బలి

చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ క్రమంగా అన్నీ దేశాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. అంతే కాదు ఈ కరోనా బారిన పడి చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. అయితే తాజాగా కోలీవుడ్‌లో రైటర్‌, ప్రొడ్యూసర్‌, నటుడు వెంకట్ సుభ కరోనాతో శనివారం కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ఓ ప్రవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ వచ్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం తుది శ్వాస విడిచారు. వెంకట్ సుభ మరణ వార్తలపై ప్రకాశ్ రాజ్‌, రాధిక, శరత్ కుమార్ సహా పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘మొళి, అళగియ తీయే, కండనాల్ మొదల్’ వంటి సినిమాలకు పనిచేసిన వెంకట్ సుభ, పలు తమిళ సీరియల్స్‌లోనూ నటించారు.

Related posts