telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలంటే గౌరవ మర్యాదలు ఉండేవి: శ్రీకాంత్ రెడ్డి

Rayachoti YCP Srikanth Reddy Shock

జగన్ ది రివర్స్ పాలన అని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలంటే గౌరవ మర్యాదలు ఉండేవని, కానీ రామకృష్ణ, నారాయణ వంటి వాళ్లు వచ్చాక కమ్యూనిస్టు పార్టీలపైనే గౌరవం పోయిందని వ్యాఖ్యానించారు.

కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును చదివే బదులు టీడీపీ కండువా కప్పుకోవాలని అన్నారు. ముస్లింలు రామకృష్ణ లాంటివాళ్ల మాటలు నమ్మొద్దని సూచించారు. మరోవైపు రాయచోటి సీపీఐ నేతలు శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ నేతలపై అవహేళనగా మాట్లాడడం తగదని అన్నారు. రామకృష్ణకు శ్రీకాంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Related posts