telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ట్రిపుల్ ఐటీ ఘటనపై స్పందించిన మంత్రి ఆదిమూలపు

suresh adimulapu minister

నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ యువకుడు ప్రవేశించి రాత్రంతా గడిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.ఓ అమ్మాయి సహకారంతో క్యాంపస్ లోకి చొరబడిన యువకుడు రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఇతర విద్యార్థినులు ఆ యువకుడు, విద్యార్థిని ఉన్న గదికి తాళం వేసి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తప్పవని అన్నారు. ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ట్రిపుల్ ఐటీలో భద్రత మరింత పెంచుతామని అన్నారు.

Related posts