telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..భారీగా ఆస్తి నష్టం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి ఢిల్లీలోని ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కాలనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో.. భారీగా ఫర్నిచర్‌ దగ్ధం అయింది. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 27 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి జరగలేదని సమాచారం అందుతోంది. కానీ.. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగినట్లు అగ్నిమాపకశాఖ అధికారి తెలిపారు. అసలు అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనేది తమకు అర్థం కావడం లేదని.. దానిపై పోలీసులు విచారణ చేపడతారని పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని.. 27 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకువస్తున్నాయని చెప్పారు.

Related posts