telugu navyamedia
తెలంగాణ వార్తలు

బండి సంజ‌య్ యాత్ర‌లో ఉద్రిక్త‌త : టీఆర్ ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట‌..గాయాలు

*బండి సంజ‌య్ యాత్ర‌లో తోపులాట‌..
*దేవ‌ర్పుల చౌర‌స్తాలో టీఆర్ ఎస్ , బీజేపీ మ‌ధ్య వాగ్వాదం

*ప‌రస్ప‌రం దాడులు చేసుకున్న బీజేపీ , టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు
*పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రలో భాగంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. జ‌న‌గామ జిల్లా దేవరుప్పులలో బండి సంజయ్ పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. ఎవరికీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో అక్కడ ఉన్న కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ క్ర‌మంలో బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో, వారి మధ్య వాగ్వాదం నెలకొంది. రాళ్ల దాడిలో కొందరు నేతలు తలలు పగిలిపోయాయి. రక్తం కారడంతో అంబులెన్స్‌లో వారిని ఆసుపత్రికి తరలించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్వ‌ల్పంగా లాఠీ ఛార్జీ చేశారు.. ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు.

Related posts