రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవాలు వైభవంగా జరిగాయి. హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో తన తల్లి అంజనాదేవితో కలిసి చిరంజీవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను అంజనాదేవి ఎగురవేశారు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకోవడం ఆనందగా ఉందని తెలిపారు. 75 సంవత్సరాలు అంటే వజ్రోత్సవ పండుగ మనం చేసుకోవడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను.
ఇంత స్వాతంత్య్రాన్ని మనకు కలుగజేయడానికి కారణం అయిన స్వాతంత్య్ర సమరయోధులు, మహానీయుల త్యాగం ఫలితమే ఈ వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాము..
మరీ ముఖ్యంగా ..స్వాతంత్య్ర సమరంలోకి వెళ్లండి అంటూ ధైర్యంగా పంపిచిన కన్న తల్లులను మరీ మరీ కొనియాడాలి. అలాంటి నిజమైన త్యాగ మూర్తులు కన్నతల్లులు.. ఆ తల్లులును స్మరించుకొని నివాళులు ఆర్పించడం కనీస ధర్మంగా భావిస్తునన్నాని చిరంజీవి అన్నారు.
ఈ క్రమంలో మాతృమూర్తి అంజనాదేవి చేతులుమీదుగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నాను..దానికి ఆమె ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
సీఎం జగన్ పై అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు…