telugu navyamedia
క్రైమ్ వార్తలు విద్యా వార్తలు

ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో విషాదం.. ఉద్యోగి  కుటుంబం ఆత్మహత్య

Crime

దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)లో విషాదం నెలకొంది.  క్యాంపస్‌లో ల్యాబ్‌ టెక్నిషీయన్‌గా పని చేస్తున్న ఉద్యోగి గుల్షాన్‌ దాస్‌తో పాటు ఆయన భార్య, తల్లి ఉరేసుకుని  ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో క్యాంపస్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ ముగ్గురు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. గుల్షాన్‌ దాస్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో సునీత అనే మహిళతో వివాహమైంది. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related posts