కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి పై ప్రత్యర్థులు వేట కొడవళ్ళతో దాడి చేశారు. తిక్కారెడ్డికి బలమైన గాయాలు తగలడంతో ఆసుపత్రికి తరలించారు. మంత్రాలయం మండలం కగ్గల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్వగ్రామం కగ్గల్ లో ప్రచారానికి వెళ్లిన తిక్కారెడ్డి.. పై దాడులు జరిగాయి. బాలనాగిరెడ్డి అనుచరులు తిక్కారెడ్డిపై దాడికి దిగారు. దీనితో పరస్పరం ఇరువర్గాలు దాడులకు దిగారు. అడ్డుకునేందుకు యత్నించిన ఎస్ఐ సహా పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు.
దీనితో అధికారులు గాలిలోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు.